Bones: మన దేహమంతా ఎముకల పై ఆధారపడి ఉంటుంది.. అటువంటి ఎముకల ఆరోగ్యం పై మనం నిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వలన ఎముకలు దెబ్బతినడానికి దోహదపడతాయి.. ఎటువంటి ఆహారాలు తింటే ఎముకలకు హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎముకల సాంద్రత పెరగాలంటే క్యాల్షియం అవసరం. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరంలో క్యాల్షియం ను తగ్గిస్తుంది. కూరగాయలలో టమోటా, వంకాయ, బంగళా దుంప ఆరోగ్యానికి మంచివే అయిన ఇవి ఎముకల్లో మంట రావడానికి కారణం అవుతాయి. మిరియాలు కూడా ఎముకలు పెళుసుగా మరెలా చేస్తాయి. ఇంటికి ఎవరు వచ్చినా కూల్ డ్రింక్స్ ఇవ్వడం అలవాటైంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆల్కహాల్ సేవించడం, సోడా ఎక్కువగా తాగే వారి ఎముకలు పెళుసుగా మారి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది. లెగ్ క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read More: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే!
కాఫీ తాగే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మన శరీరంలో ఎముకుల పై ప్రభావాన్ని చూపుతుంది. వందగ్రాముల కెఫిన్ మన శరీరంలో ఆరు గ్రాముల క్యాల్షియం ను తగ్గిస్తుంది. మన శరీరం లో క్యాల్షియం లోపిస్తే ఆ ప్రభావం ఎముకలపై పడుతుంది. దీని వలన ఎముకల సాంద్రత తగ్గి త్వరగా ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. పంచదార ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు వస్తాయి. చక్కెర వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఉప్పు లో సోడియం ఉంటుంది. దీని వినియోగం ఎక్కువైతే దేహంలో క్యాల్షియం తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో బోలు ఎముకల వ్యాధి వస్తుంది.