Stomach Pain: మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాల వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి..! ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపునొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిన విషయమే. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చిక్కుడు, ఆపిల్, అరటి పండ్లు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కడుపు నొప్పి, మంట తో పాటు మలబద్ధకం కూడా వస్తుంది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువ మోతాదులో పేగు తీసుకుంటే సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. ఆ రోజులో తక్కువగా మిగతా ఆహారాలు తీసుకోవాలి. లేదంటే మాత్రం కడుపునొప్పి, అజీర్తి వస్తుంది. పాల పదార్థాలు ముఖ్యంగా పులిసిన ఆవు పాల ఉత్పత్తులు తీసుకుంటే మాత్రం.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినకూడదు. సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్స్ తిన్న వెంటనే కడుపులో నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంది. బంగాళదుంప, టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయలు, మిరియాలు వంటివి పచ్చివి తిన్నా.. లేదంటే కూరగా వండుకొని తిన్నా కూడా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటికి తోడు పేగు కు సంబంధించిన వ్యాధులు బారిన పడతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. టమోటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ గుండెల్లో మంట వచ్చేలా చేస్తుంది.