ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి.. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. నేటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటి పలు రకాల కారణాల వలన. ఈ సమస్యను చిన్నవారి వయసులో కూడా కనిపిస్తుంది.. మధుమేహంను నియంత్రణలో ఉంచుకోపోతే ఊపిరితిత్తులు, కంటి, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.. ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకోవాలంటే ఈ గింజలు తప్పకుండా తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మధుమేహం ఉన్న వారు వారంపైన శ్రద్ధ తీసుకోవాలి.. ముఖ్యంగా వీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది.. సబ్జా గింజలలో ఫైబర్ కొద్దిగా లభిస్తుంది.. ఇది జీవక్రియను తగ్గించి.. పిండి పదార్థాలను త్వరగా గ్లూకోజ్ గా మార్చడానికి నియంత్రిస్తుంది . అర చెంచా ఈ గింజలను ఒక గ్లాస్ నీటిలో వేసి రెండు గంటల తర్వాత నీటిని తాగాలి. మధుమేహంతో బాధపడే వారికి సబ్జా గింజలు ఫుడ్..
శనగలలో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాపినోస్ అనే కరిగే ఫైబర్ శనగలలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక కప్పు లో ఒక చెంచా శెనగలను వేసి అందులో ఒక గ్లాస్ నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని తాగితే సరిపోతుంది. శనగల్లో ఉండే 100% పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇక బార్లీ గింజలలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా చెంచా బార్లీ గింజలను వేసి కాచి వడకట్టుకుని ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు ఈ మూడు రకాల గింజలను తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉండడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..