అరచెంచా : నేటి ఆధునిక జీవన విధానం, రేపు అలవాట్లు కారణంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి.. బరువు పెరగడం సులువే.. కానీ తగ్గడానికి మాత్రం చాలా రకాల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.. అయితే ఈ పొడిని అర స్పూన్ తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే వారం రోజులలోనే ఫలితం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంతకు బరువు తగ్గించే ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం..!
ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు.. అరకప్పు సోంపు గింజలు, రెండు చెంచాలు లవంగాలు, అర చెంచా మిరియాలు, చిన్న దాల్చిన ముక్క, చిన్న ముల్లేటి ముక్క, 15 యాలుకలు, శొంఠి చిన్న ముక్క, జాజికాయ ఒకటి..
ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి దాని పైన పెట్టీ.. ముందుగా చెప్పిన పదార్థాలు అన్నింటిని అందులో వేసి వేడి చేసుకోవాలి.. ఇవన్నీ కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.. ఈ పొడిని ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.. ఈ పొడి రెండు నెలలపాటు ఉంటుంది..
ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పొడిని చెంచా తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో వేసి బాగా కలపాలి. ఉదయం పరగడుపున ఈ డ్రింక్ కనుక ప్రతిరోజు తాగితే శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అంతే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒక వారం రోజులపాటు ఈ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.. బయట దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాటికంటే మన ఇంట్లో లభించే ఈ వస్తువులతో పొడి తయారు చేసుకునే తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..