ఈ రోజుల్లో ఎక్కువమంది మధుమేహంతో బాధపడుతున్నారు.. కానీ ఈ సమస్యను ముందుగానే కనుగొనగలిగితే అనేక అనారోగ్య సమస్యలకు చెప్పి పెట్టుకోవచ్చు.. డయాబెటిక్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.. మధుమేహం వల్ల పాదంలో డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ వాస్కులర్ సిసిజ్ వస్తాయి.. ఈ డయాబెటిక్ న్యూరోపతి లో నియంత్రణ లేని డయాబెటిక్ లెవెల్స్ కారణంగా నరాలు దెబ్బతింటాయి.. ఫెరీఫెరల్ వాస్కులర్ రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దాంతో పాదాలలో డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే.!?
డయాబెటిక్ న్యూరోపతి వలన పాదాలు, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. దాంతో పాదాలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, నొప్పి ఉంటాయి. అలాగే రక్తనాళాలు, జీర్ణవ్యవస్థ గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.. కాళ్ళ లో కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.. డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని కొన్ని సార్లు గొల్లపై సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కాళ్ల గోళ్ళను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గోర్ల రంగు మారడం గోళ్ల పెలుసుగా మారడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి..
మధుమేహం ఉన్న వారి కాళ్ళ వేళ్ళకు తగినంత రక్త సరఫరా అవదు. కొన్ని కొన్ని సార్లు ఆ రక్త సరఫరాకు అడ్డుపడతాయి. దాంతో ప్రవాహం ఆగిపోయి గ్యాంగ్రీన్ కు దారితీస్తుంది.. మధుమేహం వలన నరాల బలహీనతను తగ్గిస్తుంది.. ఇంకా పాదాలలోని కండరాలను బలహీన పరుస్తోంది. దాంతో పాదాల ఆకారం మారుతుంది.. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.