కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు నేరేడు పండ్లుతినడం మంచిది. ఎందుకంటే ఈ పండు సహజమైన యాసిడ్లు కలిగి ఉండడం వలన కాలేయా న్ని శక్తివంతం చేసి దాని పని తీరును పెంచుతాయి .అంతేకాదు నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగ పడుతుంది. నేరేడు గింజల్లో మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడే.
జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది.ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజులో ఒక స్పూన్ చొప్పున రెండుసార్లు భోజనంతో పాటు తినడం వల్ల మధుమేహ వ్యాధిపై మంచి ప్రభావం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అందాన్ని పెంచుకోవడం లో కూడా ఇది మంచి పాత్ర పోషిస్తుంది . నేరేడు తరచూగా తినడం వల్ల చర్మం ముడతలుపడదు. వృద్ధాప్య ఛాయలు కూడా కనబడవు.
నేరేడు చెట్టు బెరడును తీసుకుని నలగ్గొట్టి వేడి నీళ్ళలో నాన బెట్టి చేసుకున్న కషాయం లో తేనే కలుపుకొని తాగడం వలన రక్తస్రావంతగ్గుముఖం పడుతుంది . కొందరికి చెవుల్లో నుంచి చీము కారుతుంటుంది. వారికి ఇప్పుడు చెప్పేది చాలా మంచి మందు.పండ్లను, ఆకులూ, మెత్తగా దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లో చుక్కలు వేసుకోవాలి. అలా చేయడం వలన తొందరగా ఉపశమనం కలుగుతుంది.
శరీరంపై కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లపై నేరేడు ఆకుల నూరి ముద్దగా చేసి వాటిపై రాసి కట్టు కడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. వైట్ డిశ్చార్జ్ తో బాధ పడే స్త్రీలు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ రెండు తగ్గుతాయి . నేరేడు పైల్స్ తో బాధపడే వారికి బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలం లో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది.