Computer: కళ్ళు చాలా సున్నితమైన భాగం. వాటిని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. కరోనా వచ్చిన తర్వాత డిజిటల్ క్లాసులు, వర్చువల్ మీటింగ్స్ తో కళ్లపై ఒత్తిడి బాగా పెరిగింది. చాలా మంది లో కండ్లు పొడిగా ,మంటలు గా అనిపిస్తాయి. మంచి ఆహారం తింటే కండ్లకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.కళ్లకు కు మేలు చేసే విటమిన్ ఏ.. ఈ యాంటీఆక్సిడెంట్ కంటి చూపును కాపాడుతుంది. కంటిలో ఉండే కార్నియా కు రక్షణ కల్పించడం తో పాటు… కంటి బయటి పొరను కాపాడుతుంది. రెటీనా బాగా పనిచేసేలా చేస్తుంది. రంగులు గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
అందువల్ల ఈ విటమిన్ బాగా లభించే… బత్తాయి, క్యారెట్, గుడ్లు,బొప్పాయి, వెన్న,మామిడి, ఆప్రికాట్స్, బ్రకోలి, ఆవకాడో, చేపలు, దుంపలు మీ ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.కన్ను ఆరోగ్యానికి జీక్సాన్థిన్ చాలా అవసరం. ఇది కంటిచూపును మెరుగయేలా చేస్తుంది. కాంతి కంటిపై పడేటప్పుడు ఎక్కువ, తక్కువ కాకుండా చూస్తుంది. ముఖ్యంగా లైట్లు, టీవీలు, మొబైల్ ఫోన్లలో ఉండే బ్లూ లైట్ వల్ల కంటికి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతుంది. చిక్కుడు కాయలు,గుడ్లు, బచ్చలి, బ్రకోలి ,బఠాణీలు,మొక్కజొన్న, తినాలి.కంటి రెటీనా బాగా పనిచేయడానికి జింక్ తప్పనిసరి గా కావాలి. కంటి వెనుక కణజాల పొరను ఇది కాపాడుతుంది .
రే చీకటి సమస్య రాకుండా ఉండాలన్నా లివర్ నుంచి కంటికి విటమిన్ ఏ ను అందేలా చేయాలన్న, జింక్ బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
జింక్ కోసం నువ్వులు,ధాన్యాలు, గింజలు, గుమ్మడికాయ గింజలు, కూరగాయలు, పండ్లు, బచ్చలి, పుట్టగొడుగులు, మాంసం వంటివి తీసుకోవాలి.ల్యూటెయిన్ అనేది మరోరకమైన పోషకం. ఇది కండ్లలోని కలర్స్ని గుర్తించే రెండు కెరోటెనాయిడ్స్లో కూడా ఉంటుంది.
సూర్యురశ్మి నుంచి కండ్ల కణజాలాన్ని కాపాడటంలో ల్యూటెయిన్ ఉత్తమం గా పనిచేస్తుంది. ఈ పోషకం కోసం బ్రకోలి, తోటకూర, బచ్చలి ,బఠాణీలు, మొక్కజొన్న పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవాలి.