పరుగెత్తి పాలు తాగడం కన్న నిల్చుని నీరు తాగడం మంచిది అనే మాట మనం చాల సార్లు వినే ఉంటాము. కానీ, నిలబడి నీరు తాగడం అనేది మంచిది కాదు అని పరిశోధనలు చెబుతున్నాయి. నీటి ని ఖచ్చితం గా కూర్చు ని తాగాల ని లేకపోతే ఆరోగ్య సమస్య లు తప్పవని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు.
నీరు నిలబడి తాగితే అవి ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయం లోకి చేరుతుంది. అలా చేరడం వలన అసిడిటీ, అజీర్తి, ఇతర సమస్య లు వస్తాయి. అదేవిధంగా కిడ్నీల కు నీరు అందదు కూడా. ఇది మూత్రాశయ సమస్యలు, కిడ్నీ ల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలు వస్తాయి.
కాబట్టి కూర్చుని ప్రశాంతంగా తాగాలని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతు ల్లోనే ఉందని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కూర్చుని కొంచెం కొంచెం గా నీరు తాగడం వలన శరీరం లోని యసిడ్ స్థాయి సరిగ్గా ఉంటుంది. దీని వల్ల శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగడం తో పాటు నీటి లోని న్యూట్రియెంట్స్ ని శరీరం సరిగ్గా అందుకుంటుంది. మన పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని కూర్చుని నీరు తాగితే దాహం తీరుతుంది. ఆరోగ్యానికి కూడా ఎలాంటి ముప్పు ఉండదు.