ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో ఎంతో భయాందోళన చెందుతున్నారు ఇదిలా ఉండగా తాజాగా కాకులలో కొత్త వైరస్ వ్యాపించిందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైరస్ సోకి వందల సంఖ్యలో కాకులు చనిపోయాయి. ఈ విధంగా కాకులు చనిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై వాటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాల పంపించారు.
ఈ విధంగా కాకులు చనిపోవడానికి హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్ప్లుయెంజా కారణమని అధికారులు తెలియజేశారు. కాకులలో సోకిన ఈ వైరస్ ఎంతో ప్రమాదకరమైనదని, ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇండోర్లోని డాలీ కాలేజీ క్యాంపస్లో ఈ వైరస్ వల్ల దాదాపు వందకు పైగా కాకులు చనిపోయాయని ఇండోర్లోని జూపార్క్ వైద్యుడు ఉత్తమ్ యాదవ్ తెలిపారు.
ఈ చనిపోయిన కాకులలో ఎక్కువ భాగం బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు తెలియజేశారు. ఈ ప్రపంచంలో కరోనాతో పాటు మరో ప్రమాదకరమైన వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసి, కాకుల నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముందని తెలియజేసింది.
రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుంజీ లాల్ మీనా మాట్లాడుతూ, ఇప్పటికే రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ వైరస్ వల్ల వందల సంఖ్యలో చనిపోయాయని, చనిపోయిన కాకులలో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించామని తెలిపారు. ఈ వైరస్ వేగంగా వ్యాపించడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు తెలియజేశారు.