వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పచ్చడి వేసుకుని తింటే అ రుచి వేరు కదా.. అలాగే పప్పు, నెయ్యి కాంబినేషన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన పనే లేదు. నిజానికి నెయ్యిలో ఎన్నో రకాల ఔషదగుణాలు దాగి ఉన్నాయి.అందుకే ప్రతి ఒక్కరు కూడా నెయ్యిని తినడానికి ఇష్టపడతారు.నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
నెయ్యి తినడం వలన కలిగే ఉపయోగాలు :
నెయ్యిని తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె కూడా చాలా ఫిట్ గా ఉంటుంది. అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి.కానీ కొందరు మాత్రం నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. మరి నెయ్యిని ఎవరెవరు తినకూడదోఅనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని ఎవరెవరు తినకూడదో తెలుసా..?
కడుపునకు సంబంధించిన సమస్యలున్న వారు
నెయ్యిని అస్సలు తినకూడదు. కడుపు నొప్పి, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యిని తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
లివర్ ప్రాబ్లెమ్స్ :
లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధితో బాధపడేవారికి ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతినడంతో కాలేయం శాశ్వతంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే ఇలాంటి సమయంలో నెయ్యిని తినకూడదు.
హార్ట్ పేషెంట్స్:
నెయ్యి తినడం వలన కొవ్వు పెరిగే అవకాశలు ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే నెయ్యిలోని కొవ్వు ఈ కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతుంది.
దగ్గు, జలుబు ఉన్నవారు :
దగ్గు, జలుబు సమస్యతో బాధపడే వారు నెయ్యికి దూరంగా ఉండాలి. దగ్గు, జలుబు ఉన్నవాళ్లు నెయ్యి తింటే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది.అలాగే సీజనల్ ఫీవర్ తో బాధపడేవారు కూడా నెయ్యిని తినకూడదు. అలా నెయ్యి తినడం వలన దగ్గుతో పాటుగా జ్వరం కూడా ఎక్కువ అవుతుంది.