అజీర్ణ సమస్య అనేది అన్ని వయస్సుల వారికీ సంబందించిన సాధారణ సమస్య . అయితే ఈ సమస్య మళ్ళి , మళ్ళి రావటం వలన అనేక సమస్యలు వస్తాయి. మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తింటున్నప్పుడు కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల, జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడే మాత్రమే తినాలి. అజీర్తి తో అసిడిటీ, మల బద్దకం, ఆకలి మందగించడం, వంటి సమస్య లు కూడ వస్తాయి. అజీర్తి సమస్య కు సులువైన పరిష్కారాలు కొన్ని చూద్దాం.
అసిడిటీ సమస్య బాధిస్తుంటే, చిన్నం బెల్లం ముక్కను బోజనం చేసిన తర్వాత ప్రతి సారి, నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా జీర్ణం అవుతుంది. నీటిని అధికంగా తాగడం వల్ల, అసిడిటీ సమస్య నుంచి బయటపడటమే కాకుండా, అప్పటి వరకు జీర్ణం కాకుండా ఉన్న పదార్ధా,లు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అజీర్ణం సమస్యకు సోంపు గింజలు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. 1 టీస్పూన్ సోంపు ను భోజనం తర్వాత తీసుకుంటే, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణానికి మంచి ఉపశమనాన్ని ఇచ్చే ది పెరుగు. కీర దోస ముక్కలు, కొత్తిమీరను, పెరుగులో వేయాలి. ఈ మూడింటినీ భోజనం తర్వాత తాగితే అసలు ఎలాంటి అజీర్ణ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు, పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది. ఆలా తీసుకోవటం వలన ,అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం రసం తాగలేని వాళ్లు… కూరల్లో కలిపి తినొచ్చు. రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేయటంతో పాటు గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిస్తాయి . జీర్ణ సమస్యలకు ,కివీ పండ్లు కూడా చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి… జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గిపోతుంది.