ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతూన్నారు. డయబెటీస్ ఉన్న రోగులు కూడా అనేక ఇతర సమస్యలతో బాధపడుతుంటారు.ఎందుకంటే షుగర్ వ్యాధి వస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది కావున అనేక ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.అందుకే డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు తమ ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్తలు వహించాలి. ఏ చిన్న గాయం అయినా గాని అంత త్వరగా మానదు. నిజనికి అలా ఎందుకు షుగర్ వ్యాధి గ్రస్థులకు గాయం అయితే త్వరగా మానదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ పేషంట్స్ కు గాయాలు అయితే?
నిజానికి గాయం అయిన చోట త్వరగా దెబ్బ మానాలంటే గాయం అయిన ప్రదేశంలో రక్త ప్రసరణ చాలా ముఖ్యం కానీ డయాబెటిక్ పేషెంట్లలో గాయపడిన ప్రదేశానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు తగినంత వేగంగా గాయానికి చేరవు. అంటే డయాబెటిక్ పేషెంట్లలో గాయం అయిన చోట రక్త ప్రసరణ సరిగా ఉండదు కాబట్టి సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే షుగర్ పేషేంట్స్ లో గాయలు త్వరగా మానవు.
గాయలకు తీసుకోవలిసిన జాగ్రత్తలు :
డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయం అయితే వెంటనే గాయం అయిన ప్రాంతాన్ని శుభ్రం చేసి చేతులు, కాళ్ళు సబ్బుతో కడగాలి.అలాగే గాయపడిన ప్రాంతాన్ని పదేపదే తాకకుండా చూడాలి.గాయం అయిన చోట యాంటీబయాటిక్ క్రీమ్ రాసి అవసరం అనుకుంటే కట్టు కూడా కట్టాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు చక్కెర స్థాయిలు పెరగనివ్వకూడదు. వెంటనే చెక్కర స్థాయిలను నియంత్రిస్తూ చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ గాయం చిన్నది అయ్యి త్వరగా మానకుండా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.