Diabetes : దాదాపు ప్రపంచంలో రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోను ఈ వ్యాధి రావడం పట్ల రోజు వారి జీవితంలో డయాబెటిస్ ఒక భాగమైందని చెప్పవచ్చు. ఈ డయాబెటిస్ తో బాధపడేవారు వారిశరీరంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుకోవడం కోసం ఆహార నియంత్రణ పాటిస్తూ,వివిధ రకాల మందులను వాడుతూ ఉండడం మనం చూస్తుంటాము. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు మామిడి ఆకులను ఉపయోగించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ వ్యాధితో బాధపడే వారికి మామిడాకులు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం….
మామిడాకుల పై జరిపిన ఓ అధ్యయనంలో భాగంగా మామిడాకుల రసాన్ని ఎలుకలకు ఇవ్వడం ద్వారా ఎలకలు తక్కువ గ్లూకోజ్ గ్రహిస్తాయని, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఈ మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మామిడి ఆకులులో ఉన్నటువంటి ఫైబర్, పెక్టిన్, విటమిన్ సి, ఎ, బి పుష్కలంగా లభిస్తాయి.
ప్రతిరోజు 5 మామిడి ఆకులను శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీటిలో బాగా మరగబెట్టి పరగడుపున తాగడం ద్వారా కీళ్ళ నొప్పుల సమస్యను నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరిచి రక్త పోటు సమస్యను నియంత్రణలో ఉంచుతుంది.ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు మామిడాకుల టీ తాగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ, బి అధికంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా మన జుట్టు సమస్యలను కూడా తగ్గించడంలో ఈ మామిడాకులు కీలకపాత్ర పోషిస్తాయి.