ఈ సీజన్లో ఎక్కడ చుసినా నేరేడు పండ్లు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. నేరేడు పండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తినడానికి పిల్లలు, పెద్దలు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. నేరేడు పండు తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటుంది.నేరేడు పండు గాని, నేరేడు జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకురతాయి. జామూన్ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా.
నేరేడు పండు ఉపయోగాలు :
షుగర్ నియంత్రణకు ఇంట్లోనే తయారు చేసే అద్భుత ఆయుర్వేద మెడిసిన్ ఇది..! నూరుశాతం ఫలితాలు..!!
నేరేడు పండులో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్ మరియు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి.అలాగే నేరేడు జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు :
షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు రసం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే నేరేడులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా నేరేడు జ్యూస్ తాగవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే :
మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. కాబట్టి దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం, నేరేడు జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.నేరేడు జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో :
నేరేడు లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అందుకే నేరేడు జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, తద్వారా మీ శరీరం వైరస్లు,బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.నేరేడు జ్యూస్ లో ఉండే విటమిన్ ఏ వలన కళ్లకు చాలా మేలు జరుగుతుంది.ఎందుకంటే నేరేడు పండులో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో :
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి నేరేడు జ్యూస్ తీసుకోవడం ఉత్తమం అనే చెప్పాలి. నేరేడు లో అధిక శాతం ఫైబర్ ఉన్నందున, దీని వినియోగం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.