మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం తినడం వలన ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో. ఏ మాత్రం. అతిశయోక్తి లేదనే చెప్పాలి. అన్నీ పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యానికి ఆరోగ్యకరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లోఎంతో మంది ప్రజలు విటమిన్ బి12 లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే తాము బి 12 విటమిన్ లోపంతో బాధపడుతున్నాము అనే సమస్య వాళ్ళకే తెలియడకపోవడం.ఈ విటమిన్ బి12 లోపాన్ని ముందుగానే గుర్తించాలి లేదంటే దీర్ఘకాలంలో దీని వల్ల మన శరీరానికి చాలా నష్టాలు కలుగుతాయి.ఈ విటమిన్ బి12 మన దేహంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంతోపాటు డీఎన్ఏ ను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి విటమిన్ బి 12 లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ బి 12 లోపిస్తే :
విటమిన్ బి 12ను సైనకోబాలమిన్ అని కూడా దీన్ని పిలుస్తారు.ఈ లోపం వల్ల చర్మం లేత పసుపు ఛాయలోకి మారుతుంది.అలాగే నాలుకపై పుండ్లు ఏర్పడటం, నాలుక ఎర్రబడడం, చూపు మందగించడం, నడక కష్టంగా అవడం,నీరసం,ఒత్తిడి శ్వాస సరిగ్గా ఆడకపోవడం, మానసిక ఆందోళన, మలబద్ధకం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.విటమిన్ బి12 లోపం లక్షణాలు మన శరీరంలోని కాళ్లు, పాదాలు, చేతులు, అర చేతులు మొదలైన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అరచేతులు, ఇంకా పాదాల్లో మంటలు సూదులతో గుచ్చినట్టుగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలను బట్టి మనకు విటమిన్ బి12 లోపం ఉన్నట్టుగా భావించవచ్చు.
విటమిన్ బి 12 ఉండే ఆహార పదార్ధాలు :
మనలో ఈ విధమైన లక్షణాలు కనిపించినపుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, శాకాహారులు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12ను సప్లిమెంట్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలి.చికెన్, గుడ్లు, మాంసం, పాలు, పెరుగు, చీజ్, చేపలు, రొయ్యలు మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది కాబట్టి పైన చెప్పిన ఆహార పదార్ధాలను తింటే మంచిది.