విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారు. ఒక యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరం పెరుగుదలకు అభివృధి కి చాల అవసరం. విటమిన్ సి ఎక్కువగా జామ ,నిమ్మకాయలు , నారింజ , బత్తాయి, కమల, వంటి అన్ని పుల్లని పండ్లలో ఉంటుంది. టమాటో, ఆకుకూరలు, ముఖ్యంగా మునగాకు, కరివేపాకు, క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, బ్రొకోలి మొదలైన వాటిలో ఉంటుంది. విటమిన్ సి లోపం ఉన్నప్పుడు జలుబు త్వరగా వస్తుంది. తగ్గటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఊపిరితిత్తులు సరిగా పని చేయాలన్న విటమిన్ సి కావాలి. విటమిన్ సి లోపం వలన అలసట, చిగుళ్ళు వాపు, శక్తి లేకపోవడం, మరియు ముక్కు రక్తస్రావం, పొడి చర్మం, జుట్టు రాలటం, దీర్ఘకాలిక రక్త హీనత, స్కర్వీ వంటి లక్షణాలు కనిపిస్తాయి .
విటమిన్ సి తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రోగ నిరోధకవ్యవస్థ యొక్క సమతుల్యతకు ముఖ్యం. అందువల్ల ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను ఇన్ఫక్షన్ బారి నుండి రక్షిస్తుంది. విటమిన్ సి చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల గుండె జబ్బులు నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు విటమిన్ సి తీసుకోవడం వలన రక్తం లో చక్కర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. పండ్లను జ్యూస్ లా కాకుండా సాధారణ రూపంలో తినడం శ్రేయస్కరం. ఆకూ కూరలను వండిన వెంటనే వేడిగా తినటం మంచిది. పండ్లను ముక్కలుగా కోసిన వెంటనే తినాలి కానీ నిల్వ ఉంచకూడదు. క్యాబేజి, టమాట, మొదలగు కూరగాయలను సలాడ్ల రూపం లో తాజా గా తీసుకోవాలి. ధాన్యాలను మొలకెత్తించడం ద్వారా విటమిన్ సి శాతాన్ని పెంచుకోవచ్చు. కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వండుకొవడం కన్నా పెద్ద పరిమాణంలో ఉంచి వండుకోవాలి .