దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. డి-విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువసేతం కరోనా బారిన పడుతున్నారని, మరణించినవారిలోను వారే అధికమని వైద్య పేర్కొంటున్నారు.
డి-విటమిన్ సమృద్ధిగా ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్ లోపం ఉందని పలు సర్వేలు తెలుపుతున్నాయి.విటమిన్ డి లోపం అనేక శారీరిక ,మానసిక సమస్యలకు కూడా కారణంగా ఉంటుంది. పసిపిల్లల నుండి, పెద్ద వారిదాకా ఈ సమస్య ఎవరినైనా వేధించవచ్చు.
విటమిన్ డి ని శరీరానికి తగినంత పరిమాణంలో అందివ్వగలగాలి.లేదంటే చర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం వంటివే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. సూర్యరశ్మి కారణంగా ఉత్పత్తి అయ్యే విటమిన్ డి, మానవ శరీరంలో కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. విటమిన్ డి కి సూర్యరశ్మి చాల ప్రధానం.
అంతేకాకుండా, కొన్నిరకాల ఆహార పదార్ధాల నుండి కూడా విటమిన్ డి ను పొందవచ్చు. విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనే కాకుండా, తినే ఆహారం నుండి కాల్షియం శోషించడంలో కూడా సహాయపడుతుంది. ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. విటమిన్ డి లోపం ప్రధానంగా కొన్ని లక్షణాలను చూపుతుంది.
విటమిన్ డి లోపం గురించి మీరు తెలుసుకోవలసిన 5 లక్షణాలు ఇవే.. తరచుగా అనారోగ్యానికి గురవ్వడం.. తరచుగా అలసిపోవడం, డిప్రెషన్, జుట్టు రాలడం, చర్మ సంబంధ సమస్యలు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని , మీ ఆహార ప్రణాళికకు జోడించడం లేదా ఉదయం 9 గం లోపు ఎండలో 30 నిమిషాలపాటు గడపడం మూలంగా ఈ చర్మ సమస్యలను తగ్గించవచ్చు. విటమిన్ డి చేపలు, పుట్టగొడుగులు, పాలు, కాడ్ లివర్ ఆయిల్, ఛీజ్, గుడ్లు, కమలాపళ్ళు, ఓట్’స్, రొయ్యలు, వెన్న, పెరుగు మొదలెయినా ఆహార పదార్ధాలలో దొరుకుతుంది .