ఒక్కొరిలో ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుంది. అంటే ఒక సమయంలో ఒకే పనిని చేయగలుగుతారు. మరికొందరైతే ఒకే టైమ్లో రెండు మూడు పనులు కూడా చెస్తుంటారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు టీవీతో పాటు మొబైల్ చూస్తూ ఉండటం సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. మీరు కూడా ఇలా చేసే వారైతే.. తస్మత్ జాగ్రత్త ! ఎందుకు అనుకుంటున్నారా?
ఒకే సమయంలో వేరు వేరు పనులు చేసే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. మరీ ముఖ్యంగా టీవీతో పాటు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, లేదా రీల్స్ చూడటం ద్వారా మతిమరుపు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని స్టాన్ఫోర్డ మెమోరీ ల్యాబ్ కెవిన్ మడోర్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా మల్టీ మీడియా, డిజిటల్ మీడియా వినియోగదారుల్లో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు గుర్తించామని పరిశోధన బృందం తెలిపింది.
స్టాన్ఫోర్డ్ మెమోరీ ల్యాబ్ కెవిన్ మడోర్ అధ్యయనం ప్రకారం.. మీడియా మల్టీ టాస్కింగ్లను ఎక్కువగా చేసే వారిలో ఎకాగ్రత తగ్గడంతో పాటు అనేక విషయాలను వీరు గుర్తు తెచ్చుకోలేకపోతున్నట్టు వెల్లడైంది. మీడియా మల్టీ టాస్కులు అంటే ముఖ్యంగా.. ఎదేని ఒక ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లో ఒక ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, మరో ట్యాబ్లో నెట్ఫ్లిక్స్ చూడటం, అలాగే, ఏదైనా బ్రౌసర్లో పదుల సంఖ్యలో ట్యాబ్స్ ఉపెన్ చేసి అనేక పనులు చేయడం ద్వారా మతిమరుపు వస్తోంది.
ఈ పరిశోధనలో భాగంగా 80 మందిపై (18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యనున్న వారు) అధ్యయనం చేశారు. దీని కోసం వారికి ఫొటోలను, స్క్రీన్లను చూడమని చెప్పి.. టెక్నాలజీని ఉపయోగించి వారి మెధడు సమార్థ్యన్ని, పనితీరును రికార్డు చేశారు. ఆ తరువాత కొంత సమయం విశ్రాంతి ఇచ్చి.. వీరిని పరీక్షించి.. ఆ ఫలితాలను విశ్లేషణ జరుపుతూ.. అధ్యయనాన్ని కొనసాగించామని పరిశోధకులు వెల్లడించారు. ఇలా మతిమరపు రావడానికి గల కారణం కార్టిసోల్ హర్మోన్లో ఏర్పడుతున్న మార్పులే కారణమని అధ్యయనం పేర్కొంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది.