Diabetes: షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. ఎందుకంటే శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతూ తగ్గుతూనే ఉంటాయి. బాగా పెరిగిన లేదా బాగా తగ్గినా కూడా శరీరానికి హాని కలుగుతుంది.. కనుక ఇన్ని నియంత్రణలో ఉంచటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారం. చాలామంది శరీరంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచేందుకు అన్నం తినటం మానేస్తుంటారు.. అయితే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి అన్నం ఒక్కటే కారణమే కాదు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వల్ల కూడా ఉంటుంది.
అయితే చాలామంది మాకు అన్నీ తెలుసులే అని కొన్ని కొన్ని తీపి పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆకలి వేస్తుంద ని ఆహారం ఎక్కువగా తింటూ ఉంటారు.. షుగర్ ఉన్నవారు బరువు పెరుగుతుంటే శరీరంలోని చక్కెర స్థాయిలు కూడా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి.. లేకపోతే షుగర్ పెరగటం వల్ల శరీరంలోని అవయవాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది వింటర్లో శరీరంలోని వేడి కోసం అనేక ఫాస్ట్ ఫుడ్స్ ను తింటూ ఉంటాం.. దీనివల్ల కూడా శరీరంలోని చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..
కొంతమంది అనవసరంగా అన్నం తినడం మానేస్తారు కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు అన్నం, తీపి పదార్థాలు, బంగాళదుంప రసగుల్లా,ఐస్ క్రీమ్ ఫాస్ట్ ఫుడ్స్ వంటి ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.. బరువు పెరగకుండా చూసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధ్యమైనంత వరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.. అదే బరువు పెరిగితే మాత్రం డయాబెటిక్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు..