Abyangasnanam: పొద్దున్న చేసే స్నానానికి చన్నీళ్ళు ఎంత ఉత్తమమో సాయంత్రం స్నానానికి వేడి నీళ్ళు అంత ఉత్తమం. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చెయ్యడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం.
1. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానంరోజంతటి ఒత్తిడి తగ్గేలా చేస్తుంది.
2. వేడి నీళ్ళతో స్నానం శరీరం మరియు మైండ్ ని విశ్రాంత పరుస్తుంది.
3. చర్మం మీద ఉన్న విష పదార్థాలను పోగొట్టుకోవడానికి వేడి నీటి స్నానం ఉత్తమం.
4. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చేయడం వలన మన మానసిక స్థితిని చక్కబరుస్తుంది.
5. మంచి రాత్రి నిద్రను ఇస్తుంది,త్వరగా నిద్ర పట్టెలకుడా చేస్తుంది.
6. అభ్యంగ స్నానం గురించి తెలుసుకుందాం స్నానం చేసే ముందు ఒంటికి ఆయిల్ మసాజ్ చేయాలని ఆయుర్వేదం తెలియ చేస్తుంది. ఆయిల్ మసాజ్ చేసుకుని స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. మీ శరీరానికి నువ్వుల నూనె లేదా ఆవాలు నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది. దీని కోసం రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడడం మంచిది. శరీరానికి మసాజ్ చేయడానికి నూనెను కాస్త గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆ నూనెతో పావుగంట పాటు మసాజ్ చేసిన తర్వాత స్నానం స్నానం చేసేయవచ్చు.
కుదిరితే ప్రతీరోజూ లేదా కనీసం వారానికి ఒకసారి అయినా ఇలా స్నానం చేయడం మంచిది. అభ్యంగనం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
Abyangasnanam: అభ్యంగ స్నానం:
1. అభ్యంగనం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
2. శరీరం నుండి మలినాలను తొలగించడం అనేది జరుగుతుంది.
3. గోరువెచ్చని నూనె మసాజ్ వాన నరాలను శాంతింపజేయడం అనేది జరుగుతుంది.
4. అభ్యంగనం వలన చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది.
5. రోజు మొత్తం కి కావలిసిన శక్తి పొందుతాము.
6. నిద్ర యొక్క నాణ్యత పెరుగుతుంది.
అభ్యంగనం అలసటను తగ్గిస్తుంది. దృఢత్వం, ఆనందం తో పాటు పరిపూర్ణ నిద్రను ప్రసాదిస్తుంది. అదేవిధం గా చర్మం యొక్క రంగు మరియు మెరుపు ను పెంచడం తో పాటు దీర్ఘాయువును కూడా కలుగ చేస్తుంది.