Womens: స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.అటు ఉద్యోగ రంగం తో పాటు ఇటు వ్యాపార రంగం లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. తమదైన టాలెంట్ తో గుర్తింపు పొందుతున్నారు. మరి, కొన్ని కొన్ని కీలకమైన అంశాలలో నిర్ణయాలు తీసుకునే విషయంలో స్వతంత్రంగా ఉండగలుగుతున్నారా ? లేదా వారు తీసుకొనే నిర్ణయాన్ని ఇంకా ఎవరైనా ప్రభావితం చేయగలుగుతున్నారా ? అనే విషయం మీద డీఎస్పీ డబ్ల్యూఇన్వెస్టార్ పల్స్ 2019 పేరు డీఎస్పీ మ్యూచువల్ ఫండ్స్, రీసెర్చి ఏజెన్సీ నీల్సన్ సంయుక్తంగా సర్వే నిర్వహించారు . పెట్టుబడుల రంగంలో స్త్రీలు నిర్ణయాధికారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సర్వేలో తెలిశాయి.
పెట్టుబడుల రంగంలో ఉన్న మేల్ ,ఫిమేల్ లక్ష్యాలు ఒకే రకం గా ఉన్నాయి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం, అప్పుల బాధలతో సతమతం అవకుండా ఒక ప్లాన్ తో హాయిగా జీవితాన్ని గడపడం , సొంత ఇల్లు కట్టుకోవడం వంటివి వారి లక్ష్యాలు గా ఉన్నాయి . అయితే వాటిని నిజం చేసుకునే విషయంలో వీరిద్దరి మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది . ముఖ్యంగా భూమి, ఇల్లు, వాహనాలు, కొనుగోలు చేసే విషయంలో ఆడవారు స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు. వారిపై తండ్రి లేదా భర్త పెత్తనం కనిపిస్తుంది. అదే బంగారం కొనడం , సరుకులు కొనడం, గృహాలంకరణ వస్తువుల కొనే విషయంలో మాత్రం ఆడవారే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
పెట్టుబడుల రంగంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారు. ఫండ్ మేనేజర్ గా ఆడవారు తమ శక్తిని నిరూపించుకుంటున్నారు. అయినా కూడా వారి శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని చెప్పుకోక తప్పదు . అసలు ఈ రంగంలో వారిని పట్టించుకునేవారే కరవవుతున్నారు అంటే ఆశ్చర్యం లేదు. పెట్టుబడులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే స్త్రీలకు స్వతంత్రత లేదు. కేవలం 33 శాతం మంది మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకో గలుగుతున్నారు. మిగిలిన వారు మాత్రం మగవారి నిర్ణయానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. పేరెంట్స్ ప్రోత్సహిస్తే పెట్టుబడుల రంగంలోకి అడుగుపెట్టిన స్త్రీలు మిగిలిన వారితో పోల్చి చూసినప్పుడు చాలా స్వతంత్రంగా వ్యవహరించ గలుగుతున్నారు. ఇంకో 13 శాతం స్త్రీలు తమకు ఇష్టం లేకపోయినా పెట్టుబడులు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వేలో బయట పడింది. దీని వెనుకున్న కారణం ఏమిటంటే, వారి భర్త లేదా తండ్రి మరణం అని తెలుస్తుంది.
పెట్టుబడుల రంగంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారు. ఫండ్ మేనేజర్ గా ఆడవారు తమ శక్తిని నిరూపించుకుంటున్నారు. అయినా కూడా వారి శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని చెప్పుకోక తప్పదు . అసలు ఈ రంగంలో వారిని పట్టించుకునేవారే కరవవుతున్నారు అంటే ఆశ్చర్యం లేదు. పెట్టుబడులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే స్త్రీలకు స్వతంత్రత లేదు. కేవలం 33 శాతం మంది మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకో గలుగుతున్నారు. మిగిలిన వారు మాత్రం మగవారి నిర్ణయానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. పేరెంట్స్ ప్రోత్సహిస్తే పెట్టుబడుల రంగంలోకి అడుగుపెట్టిన స్త్రీలు మిగిలిన వారితో పోల్చి చూసినప్పుడు చాలా స్వతంత్రంగా వ్యవహరించ గలుగుతున్నారు. ఇంకో 13 శాతం స్త్రీలు తమకు ఇష్టం లేకపోయినా పెట్టుబడులు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వేలో బయట పడింది. దీని వెనుకున్న కారణం ఏమిటంటే, వారి భర్త లేదా తండ్రి మరణం అని తెలుస్తుంది.
ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే,తండ్రులతో పోలిస్తే భర్తలే ఆడవారిని పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తున్నారు. తమ కూతుళ్లను ప్రోత్సహించే తండ్రులు కేవలం 27 శాతం ఉంటే.. భర్త లు మాత్రం 40 శాతం వరకు ఉన్నారట.
ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, కొచ్చి, గువాహటీ ఇండోర్,లూథియానా, నగరంలో ఈ సర్వే జరిగింది. 25-60 ఏళ్ల మధ్య వయసున్న 1853 మంది మగవారు , 2160 మంది ఆడవారు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, కొచ్చి, గువాహటీ ఇండోర్,లూథియానా, నగరంలో ఈ సర్వే జరిగింది. 25-60 ఏళ్ల మధ్య వయసున్న 1853 మంది మగవారు , 2160 మంది ఆడవారు ఈ సర్వేలో పాల్గొన్నారు.