శృంగారం దంపతుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. . శృంగారంచేయడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఒక పరిశోధనలోతేలితే.. శృంగారం మహిళల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుందని మరో పరిశోధన చెబుతోంది. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బులు సైతం రావని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమిని దూరం అవుతుంది.రోగ నిరోధక శక్తితో పాటు ఆయుర్ధాయాన్ని కూడా పెంచే అద్భుతమైన శక్తి శృంగారం కలిగి ఉందని పరిశోధనలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగారానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం..
శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలన్నా కోరిక ఉంటుంది. శృంగారం లోకొంతమందికి చాలా ఫాంటసీలు ఉంటాయి. వాటిని నేరవేర్చుకునేందుకు వాళ్లు చాలా ప్రయత్నలు చేస్తుంటారు . ఇంకొందరు తాము ప్రతిరోజూ కలయిక లో పాల్గొంటామని చాలా గర్వంగా చెబుతుంటారు. అయితే.. శృంగారం లో పాల్గొన్న వారందరు శృంగారాన్ని ఆస్వాదించినట్లేనా..;?అసలు నిజంగా శృంగారాన్ని ఎవరు ఆస్వాదిస్తున్నారు..? భావప్రాప్తి పై జరిగిన పరిశోధనలలో ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయో చూద్దాం..
డ్యూరెక్స్ జరిపిన ఒక సర్వేలో, చైనీయులు లైంగిక జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించడం లేదట. వారికి భావప్రాప్తి చాలా తక్కువగా కలుగుతోందట .దాదాపుగా 76శాతం చైనా మహిళలకు కనీస భావప్రాప్తి కూడా కలగడం లేదట.అయితే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న దేశాల్లో స్పెయిన్,ఇటలీ, మెక్సికో తొలి జాబితాలోనే ఉన్నాయట.వీరికి ఎక్కువగా భావప్రాప్తి కలుగుతుందట.
ప్రపంచ వ్యాప్తంగా 45శాతం మంది కి మాత్రమే శృంగారంలో భావప్రాప్తి కలుగుతుందట.మగవారు చాలా త్వరగా భావప్రాప్తి పొందుతారట. అయితే..స్త్రీ లు మాత్రం చాలా ఆలస్యం తృప్తి పొందుతున్నారట. అమెరికా 48శాతం తో 10వ స్థానంలోఉంటే ఇక భారత్ 61 శాతం తో రెండో స్థానంలో ఉందట.ఒక్క జపాన్ మాత్రం ఆఖరి స్థానఁ లోనే ఉండిపోయిందట..అనుకూలమైన శృంగారాన్ని మాత్రం రష్యన్ మహిళలు పొందుతున్నారట .అందుకే రష్యాలో ఎక్కువ మంది ఆడవారు కవలలకు , ట్రిపులెట్స్ కి జన్మ నిస్తున్నట్టుగా పరిశోధకులు తెలియచేసారు.
ప్రభుత్వాలే కండోమ్ వాడకం యొక్క అవసరాన్ని ప్రకటనల తో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నారు. కండోమ్స్ వాడడంవలన 97 నుండి 98 శాతం సురక్షితమని పరిశోధకులు వెల్లడించారు. కండోమ్ తయారు చేసిన తేదీ దగ్గరనుండి నాలుగు సంవత్సరాలు వాడుకోవచ్చు. 4 సంవత్సరాల కాలం తర్వాత కండోమ్స్ సుఖ వ్యాధుల నుండిఎలాంటి రక్షణ ఇవ్వలేవు . అవాంచిత గర్భం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో లభించిన అన్ని కండోమ్స్ జంతువుల యొక్క మూత్రాశయాల నుండి తయారుచేసినవేనట. 1640 సంవత్సరంలోనే లండన్ లో మొట్టమొదటి కండోమ్ ని తయారుచేయడం జరిగిందట . చనిపోయిన పంది పేగుల తో తయారుచేయబడిన కండోమ్ ని వేడి పాలతో శుభ్రం చేసి వినియోగదారులకు ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా జాగ్రత్త లు తీసుకునే వారట .
ఈజిప్షియన్ దేశస్తులు కండోమ్ తయారీలో గొర్రెలు,మేకలు, పందులు మూత్రాశయాలను ఉపయోగించేవారట. పారిశ్రామిక విప్లవం తర్వాత 1920వ సంవత్సరంలో జంతువుల నుండి కాకుండా రబ్బరు చెట్లనుండి కండోమ్స్ తయారు చేయడం మొదలు పెట్టారు . 1932లో డ్యూరెక్స్ అనే లండన్ కంపెనీ లక్షల సంఖ్యలో రబ్బరు కండోమ్స్ ని అమ్మి సంచలనం సృష్టించింది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కండోమ్స్ తయారీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల కండోమ్స్ దొరకడంతో పాటు వాటిలో ఫ్లేవర్స్ కూడా దొరకడం విశేషం గా చెప్పవచ్చు .