సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రతిసారి మహిళలు అనారోగ్యం బారిన పడటం వల్ల వారు ఎంతో నీరసించి పోతుంటారు. అందువల్ల వారి ఆరోగ్యం మెరుగుపడాలంటే వారి ఆహార విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మహిళల్లో ప్రతి నెల నెలసరి రావడం వల్ల ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే మహిళలు ఎక్కువగా క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఎలాంటి వ్యాధికారక బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించడానికి వాటి పై దాడి చేస్తాయి.
అధిక శరీర బరువుతో బాధపడే మహిళలు ప్రతిరోజు ఓట్స్ తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా అవిస గింజలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా అవిస గింజలు వాపులు, నొప్పిని తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
మహిళలు పాటించే ఆహార నియమాలలో భాగంగా పాలకూరను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పాలకూరలో అధిక శాతం మెగ్నీషియం, క్యాల్షియం ఉండటం వల్ల ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. అంతేకాకుండా మహిళల్లో ఏర్పడే బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా టమాట కాపాడుతుంది.ప్రతిరోజు టమోటాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సైతం కరిగిస్తుంది. ఈ విధమైన ఆహార నియమాలను పాటించడం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.