ఆ నాటి సమాజం లో ఉండే ప్రతి కూలతలను తన ప్రసంగాల ద్వారా మార్చిన స్వామి వివేకానంద మనకు ఆదర్శము.
అమెరికాలో సైతము ఆయన తన వాక్ దాటితో ఎంతో మంది విదేశీయుల ను కూడా మెప్పించగలిగారు. ఈ నాటి మన సమాజం కొందరు మహానుబావులు తమ మాటలతో ప్రవచనాలతో ఎందరో జీవితాలలో ఆధ్యాత్మిక వెలుగులు నింపి జీవితాలకు దారిచూపిస్తున్నారు.మాటకు ఉన్నశక్తి అలాంటిది.ఒక్కొక్కసారి మాట మంత్రం కూడా అవుతుంది..మాట హృదయం నుంచి వస్తుంది..దానికీ కొంత శక్తి ఉంటుంది.
ఓక మంచి మాట మన నోటినుండి వస్తే అది నిజం అయ్యేందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే ఎప్పుడూ శుభం పలకాలి, మంచే మాట్లాడాలి అంటారు. పెద్దవారికీ నమస్కరిస్తే.. అంతా శుభం జరగాలని దీవిస్తారు. ఎందుకు.. అలా దీవిస్తారు…వారు దీవిస్తే అంతా మంచే జరుగు తుందా..?? మాటకు నిజముగా అంత విలువ ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే చెప్పాలి.. మంచి మాటకి నిజం గా శక్తి ఉంది. అది పాజిటివ్ శక్తినిఇస్తుంది. మంచి ఆలోచనలను కలిగిస్తుంది.
అందుకే.. పెద్దలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభీష్టాలు సిద్ధించాలని ఆశీస్సులు ఇస్తారు. నిండుమనసుతో, తృప్తి నిండిన హృదయంతో ఇచ్చే నిష్కల్మష ఆశీ ర్వచనంలో బలం ఉంటుంది.ఈ విషయాన్ని మన ఉపనిషత్తులు కూడా నిజమని చెబుతున్నాయి. ఉపనిషత్తులు ఏమంటున్నాయి అంటే శుద్ధత్వం ఉండే వాచకం అమృతంతో సమానమట. అందుకే.. పెద్దల ఆశీస్సులు నైతిక బలాన్నిస్తాయి.
జీవితంలో అవి మనల్ని ముందుకు నడిపించే శక్తులవుతాయి. మనకు తెలియ కుండానే మనకు మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు అర్థమైందా.. మాటకు ఎంత శక్తి ఉందో..!కాబట్టి మంచి ఆలోచనలతో మంచి సంకల్పాలతో ఉండి వాక్ ని మంత్రమయం చేసుకోండి.