Breaking: ఇరాక్ ప్రధాని ముస్తాఫా ఆల్ – కదిమి నివాసంపై బాంబు దాడి జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ తెల్లవారుజామున పేలుడు పదార్ధాలతో నిండిన ఓ డ్రోన్ తో బాగ్దాద్ లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్లు భద్రతా దళాలు తెలిపాయి. అయితే ఈ దాడి నుండి ప్రధాని ముస్తాఫా సురక్షితంగా బయటపడినట్లు ఇరాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనలో ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు.
Breaking: ప్రధాని ముస్తాఫా సురక్షితం
గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రోన్ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ దౌత్య భవనాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై జరిగిన దాడిని ఇరాక్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. ఇది ఆరోగ్యకరం కాదని పేర్కొంది. దీనికి సంబంధించి వివరాలు ఇంకా ఏమీ వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారనీ, అందరూ సంయమనం పాటించాలంటూ ప్రధాని ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.