బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. 96 సంవత్సరాల వయసు కలిగిన ఎలిజిబెత్ తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలం నుండి వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి స్కాట్లాండ్ లోని బల్మోరల్ ప్యాలెస్ లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంతకుముందే ఆమె ఆరోగ్యం మరింత క్షమించడంతో సన్నిహిత రాజ కుటుంబీకులంతా గురువారం ఉదయమే బల్మోరల్ కి చేరుకోవడం జరిగింది. ఇంకా బ్రిటన్ రాణి ఆరోగ్యం గురించి వార్తలు రకరకాలుగా వస్తూ ఉండటంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఇంకా పర్యటకులు బకింగ్ హోమ్ ప్యాలెస్ చేరుకున్నారు. అయితే సాయంత్రానికి ఆమె మరణించిన వార్త తెలియడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
1952 లో 25 సంవత్సరాలకే బ్రిటన్ రాణిగా పట్టాభిషేకం పొందిన ఎలిజిబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. అయితే ఆమె ఆరోగ్యం గత ఏడాది అక్టోబర్ నుండి క్షీణిస్తూ ఉండటంతో..బల్మోరల్ లో వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కనీసం ధైనందిన కార్యకలాపాలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయే పరిస్థితిలో వయసు సంబంధిత సమస్యలతో బ్రిటన్ రాణి ఆరోగ్యం క్షిణించిపోయింది. ఈ పరిణామంతో ఆమె ప్రయాణాలను కూడా తగ్గించుకోవడం జరిగింది. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా ఇటీవల ఆమె బల్మోరల్ నుండే చేపట్టారు. బుధవారం ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో జరగాల్సిన సమావేశంలో పాల్గొనాల్సిన ఆమె చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా వాయిదా పడటం జరిగింది. అయితే గురువారం నాటికి మరణించడంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఇంకా పర్యాటకులు బకింగ్ హోమ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు.
ఇప్పటికే రాణి సహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ వద్దకు చేరుకోవడం జరిగింది. తన తల్లి రాణి ఎలిజిబెత్ 2 మరణంతో ఆమె కుమారుడు ఫ్రెండ్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా సింహాసనాన్ని అధిరోహించడం మాత్రమే కాదు ఆమె వ్యక్తిగత సంపదను.. వారసత్వంగా ఏటువంటి పన్నులు చెల్లించకుండా పొందుకుంటున్నాడు. క్వీన్ ఎలిజిబెత్ 2 దగ్గర బంగారం విలువ కనీసం మూడు బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ మొత్తం ఆమె వారసుడిగా ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కి చెందుతుంది. ఇక ఇదే సమయంలో రాణి ఎలిజిబెత్ 2 సంతాప కార్యక్రమాలను 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా.. సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్వీన్ ఎలిజిబెత్ 2 మరణం పట్ల ప్రధాని మోడీ ఇంకా పలువురు ప్రపంచ అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.