శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబద్దంలో చిక్కుకున్నారు. శ్రీలంకలో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహాంతో గొటబాయ రాజపక్స మల్దీవుల మీదుగా సింగపూర్ పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స సోదరైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి బలిల్ రాజపక్స లు కూడా దేశం విడిచి పారిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సుప్రీం కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరు దేశం విడిచి వెళ్లకుండా నిషేదాజ్డలు జారీ చేసింది.
శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభానికి రాజపక్స సోదరులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ మూడు రోజుల క్రితం కొలంబోలోని అధ్యక్ష నివాసాన్ని ప్రజలు ముట్టడించడం, ఆ నేపథ్యంలోనే గొటబాయ అధ్యక్ష నివాసాన్ని వీడి రహస్య ప్రదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎయిర్స్ ఫోర్స్ విమానంలో మాల్దీవులకు , అక్కడ నుండి సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు వెళ్లిపోయారు. సింగపూర్ కు వెళ్లిన తరువాత గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు.
గొటబాయ రాజీనామాతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడుగా ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 28వ తేదీ వరకూ మహింద రాజపక్స, బసిల్ రాజపక్స లు దేశం విడిచి వెళ్లిపోకుండా నిషేదాజ్డలు విధించింది సుప్రీం కోర్టు. కాగా గొటబాయ కంటే ముందుగానే దేశం దాటి పోయేందుకు బసిల్ రాజపక్స ప్రయత్నించగా ప్రజలు అడ్డుకున్నారు.