తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో ఇండియా – శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే చరిత్రలో మరో ఘనతను కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ పేరిట ఉన్న 290 పరుగుల రికార్డును భారత్ అధిగమించి 317 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. మూడో వన్డేలో 73 పరుగులకే శ్రీలంక జట్టు ఓటమి పాలైంది. సిరాజ్ నాలుగు వికెట్లతో శ్రీలంకను హడలెత్తించగా, షమీ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. పీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. అపెన్ బండార ను అబ్సెంట్ హార్ట్ గా పరిగణించారు.
లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ జట్టులో ఓపెనర్ సువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్) కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. 391 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ప్రారంభించిన శ్రీలంక ఆది నుండి తడబడుతూనే ఉంది. 20 ఓవర్లలోనే కథ ముగించారు. ఏ ఒక్క బ్యాటర్ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం వంద పరుగులు కూడా చేయలేక శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుసగా పివిలియన్ పడతుండటంతో అలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ 166 పరుగులు చేసి తన బ్యాట్ లో చేవ తగ్గలేదని నిరూపించారు. శుభమన్ గిల్ 116 పరుగులు చేసి ఆవుటయ్యాడు. నేటి మ్యాచ్ లో విజయంతో భారత్ వన్డే సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.