ఇంగ్లాడ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ కీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ లు సత్తా చాటి ఒకే రోజు స్వర్ణంతో సహా మూడు పతకాలు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణపతకం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 201 కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను.. క్లీన్ అండ్ జర్క్ లో 113 కేజీీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. స్నాచ్ తొలి ప్రయత్నంలో 84 కేజీలు, రెండో ప్రయత్నంలో 98 కేజీలు విజయవంతంగా పూర్తి చేసిన మీరాబాయి చాను.. మూడో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్ తొలి ప్రయత్నంలో 109 కేజీలు, రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తిన మీరా బాయి .. మూడో ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫమైంది. 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ భారత్ కు తొలి స్వర్ణం అందించింది మీరాబాయి ఛానునే కావడం గమనార్హం.
మరో వైపు వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు శనివారం మూడు పతకాలు దక్కాయి. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గర్ రజత పతకాన్ని సాధించగా. పురుషుల 61 కేజీల విభాగం ఫైనల్ లో గురురాజ్ పూజారి కాంస్య పతకం కైవశం చేసుకున్నాడు. గురురాజ్ 269 కేజీల బరువు ఎత్తి మూడవ స్థానంలో నిలిచారు. స్నాచ్ లో 118 కేజీలు, జెర్క్ లో 151 కేజీల బరువు ఎత్తాడు. గురురాజ్ గత కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం సాధించారు. బర్మింగ్ హోమ్ లో వెయిట్ లిప్టర్ల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలను అభినందించారు.