Israel: ప్రపంచంలో కొత్త టెక్నాలజీ తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే దేశాల్లో ఒక దేశం ఇజ్రాయెల్. చుట్టూ అరబ్ కంట్రీలు అనేక దాడులు చేస్తున్న వాటిని తట్టుకుని.. నిలబడే గలిగే దేశం ఇజ్రాయెల్. ఉగ్రవాదులు అనేకసార్లు రాకెట్లతో దాడులు చేస్తున్న వాటిని ఐరన్ డోమ్ అనే దానిద్వారా గాలిలోనే ఆ రాకెట్లను నిర్వీర్యం చేయటం మాత్రమే కాక వాటి దిశను మార్చేయడం.. లాంటివి ఇజ్రాయిల్ దేశానికే చెందుతాయి. శత్రువు టార్గెట్ పెట్టిన.. టార్గెట్ అవ్వకుండా వారు ఎటువంటి.. వ్యూహాలతో వస్తారో ప్రతివ్యూహాలతో ఇజ్రాయెల్ శత్రువులను దెబ్బ కొడుతూ ఉంటది. ఇదిలావుంటే ఇటీవల ఇజ్రాయేల్ దేశ సరిహద్దులలో పహారా కాసే సైనికులపై కొంతమంది దుండగులు ఉగ్రవాదులు.. దాడులు చేస్తూ ఉండటంతో.. ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో తక్కువ ఉండగా గాయపడిన పరిస్థితులు చాలానే ఉన్నాయి.
అయితే ఈ తరుణంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ దేశంలో చోటు చేసుకోకుండా.. ఇజ్రాయిల్ తాజాగా దేశ సరిహద్దుల్లో సైనికులు లేకుండానే భద్రత కోసం రోబోటిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. సైనికులు లేకుండానే ఈ రోబోటిక్ వాహనాలు.. శత్రువు కనబడితే చాలు.. వాళ్ళ అంతు చూసే రీతిలో.. సరికొత్త టెక్నాలజీ మిషన్ లో అమర్చడం జరిగింది. ఈ క్రమంలో ఈ వాహనాలలో రెండు మిషన్లు అదేరీతిలో కెమెరాలు.. సెన్సార్లు.. అందుబాటులో ఉంచటం జరిగింది. రెక్స్ ఎంకే 2 పేరుతో సిద్ధం చేసిన ఈ రోబోటిక్ వాహనాలను ఎలక్ట్రానిక్ ట్యాబ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇజ్రాయిల్ ప్రభుత్వ సంస్థ ఇజ్రాయిల్ ఎరోస్పేస్ దీనిని తయారు చేసింది.
ప్రస్తుతం వీటిని బోర్డర్లో తీసుకురావటానికి ఇజ్రాయెల్ ఆర్మీ బలగాలు… సన్నద్ధం అవుతున్నాయి. ఇజ్రాయిల్ సరిహద్దులలో ఎక్కువగా ప్రమాదకరమైన ప్రాంతాలలో వీటిని ముందుగా.. వాడాలని అని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రోబోటిక్ ఎలక్ట్రిక్ వాహనాలు… అందుబాటులోకి రావటంతో .. ఇజ్రాయిల్ శత్రువులు హడలెత్తిపోతున్నారట. ఐరన్ డోమ్ ద్వారా.. ఇజ్రాయేలు పౌరులను లక్ష్యం చేసుకుని.. శత్రువులు వినియోగించే రాకెట్లు వారిపైనే పడేలా.. చేయగా ఇప్పుడు సైనికులు లేకుండానే.. ఇజ్రాయిల్ సరిహద్దులలో రోబోటిక్ వాహనాలు ఇజ్రాయిల్ ప్రభుత్వం తీసుకు రావటం.. మిడిల్ ఈస్ట్ లో సంచలనంగా మారింది.