Modi – Biden Meet: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం రాత్రి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వర్చువల్ గా సమావేశమైయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా మద్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇరుదేశాలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా భారత్ – అమెరికా ద్వైపాక్షిత అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంలో భారత్ – అమెరికా లక్ష్యాల్ల సారూప్యత ఉందని జో బైడెన్ తెలిపారు. రక్షణ రంగంలో భారత్ తో బలమైన బంధం ఉందని అన్నారు. అనంతరం భారత ప్రధాన మోడీ మాట్లాడుతూ ఉక్రెయిన్ లో రష్యా మారణ కాండను ఖండిస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇరుదేశాల అధ్యక్షుడు జెలెన్ స్కీ, పుతిన్ లను కోరినట్లు మోడీ తెలిపారు.
Modi – Biden Meet: ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడా
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే చాలా సార్లు మాట్లాడానని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించాలని ఇద్దరికీ విజ్ఞప్తి చేసినట్లు బైడెన్ కు మోడి వివరించారు. ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జెలెన్ స్కీ, పుతిన్ లతో మాట్లాడి సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేసి భారతీయ విద్యార్ధులను సురక్షితంగా తరలించినట్లు మోడీ చెప్పారు. ఉక్రెయిన్ కు ఔషదాలు, ఇతర సహాయ సామాగ్రి అందజేయడంతో పాటు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులపై భారత పార్లమెంట్ లోనూ చర్చించిన విషయాన్ని బైడెన్ దృష్టికి తీసుకువెళ్లారు మోడీ. రష్యా భీకర దాడుల్లో ఘోరంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ మానవతా సాయాన్ని బైడెన్ స్వాగతించారు.