Pakistan Power Crisis: మహమ్మారి కరోనా(Corona) కారణంగా ప్రపంచం దాదాపు రెండు సంవత్సరాలు పాటు స్తంభించుకోవడంతో.. అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. కరోనా సమయంలో లాక్ డౌన్(Lock Down) చేపట్టడంతో… ఇందనం మరియు బొగ్గు ఎగుమతి దిగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో… అనేక దేశాలు విద్యుత్ సంక్షోభం కారణంగా అంధకారంలోకి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే భారత్ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఏప్రిల్ మరియు మే, జూన్ నెలలో భారత్(India) లో అనేక రాష్ట్రాలు చీకటిమయంలోకి వెళ్లిపోయాయి. విద్యుత్ సంక్షోభం కారణంగా ఆసియాలో ఇప్పుడు భారత్ తోపాటు పాకిస్తాన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం పాకిస్తాన్(Pakistan) దేశంలో విద్యుత్ సంక్షోభం భారీ ఎత్తున ఉంది. దేశవ్యాప్తంగా గంటలకొద్దీ విద్యుత్ కోతలు కారణంగా పెద్ద పెద్ద మాల్స్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ లు.. త్వరగా క్లోజ్ చేయాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు అత్యవసర సేవలను కూడా నిలిపివేసే పరిస్థితులు ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో నెలకొన్నాయి. విద్యుత్ సంక్షోభం కారణంగా మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని ముందుగానే టెలికాం సంస్థల హెచ్చరించడం జరిగింది. అయితే పాకిస్తాన్ ప్రధాని షేహబజ్ షరీఫ్..కూడా జులై నెల నుండి… సరిపడ కరెంట్ ఉండకపోవచ్చు అని ముందుగానే హెచ్చరించటం జరిగింది.
ఇటువంటి తరుణంలో విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేయిస్తున్నట్లు పాక్ ప్రధాని తెలియజేశారు. ఇటువంటి తరుణంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి.. ఖత్తర్ దేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తెలియజేశారు. మరో పక్క పాకిస్తాన్ దేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణం రోజురోజుకి దిగజారుతోంది. కారణం విదేశీ పెట్టుబడులు లేకపోవడం అని అంటున్నారు. ఒకపక్క ఆర్థిక తీవ్ర సంక్షోభంతో పాటు విద్యుత్ సంక్షోభంతో.. పాకిస్తాన్ ప్రస్తుతం కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల నుండి అధిగమించటానికి ప్రస్తుత షేహబజ్ షరీఫ్ ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రమిస్తుంది.