పర్యాటకానికి పెట్టింది పేరు మాల్దీవులు. ఈ మాల్దీవులు 26 ద్వీపాల సముహం. ఇక్కడ సహజమైన బీచ్లు, చల్లటి వాతావరణంతో భలేగా ఉంటుంది. దీన్ని చూసిన చాలా మంది స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమోనని అంటారు. ప్రతీ ఐలాండ్లోని రిసార్టులు, స్వీమ్మింగ్ ఫూల్స్, బెడ్రూం విల్లాలు ఇక్కడి ప్రత్యేకం. ఇక్కడ విడిది చేయాలంటే మాత్రం పర్యాటకులు ఒక్కరోజుకు రూ.1000 నుంచి లక్షల్లో పే చేయాల్సి ఉంటుంది. అందుకే సాధారణ జనం అక్కడ పోవడం చాలా అరుదు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఎంతో మంది విడిదికి మాల్దీవులకే పోతుంటారు.
కరోనా కారణంలో వచ్చిన లాక్డౌన్ తో 8 నెలల పాటు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ ఎత్తివేయడంతో సెలబ్రెటీలంతా రిఫ్రెష్మెంట్ కోసం ఎక్కువగా మాల్దీవులకు క్యూ కట్టారు. అందులో మన తెలుగుఉ తారలు ఎంతో మంది వెళ్లివచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషిలో కొత్తగా ఒక ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించేశారు.ఈ రీసార్టు ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్శిస్తోంది. కానీ దీని ఖరీదు చూసి నోళ్లు వెల్లబెట్టడం కాయం. 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రైవేట్ ద్వీపం ఉంది. లగ్జరీ రూమ్లతో ఈ రిసార్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అయితే అక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు చెల్లించాల్సిందేనట.
ఈ ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్ విల్లాలు ఉంటాయి. ఇందులో లగ్జరీ బెడ్రూమ్లు, రెండు ఓవర్ వాటర్ బెడ్రూమ్లు, రెసిడెన్సీ బెడ్రూములు ఉంటాయి. అలాగే మంచి మంచి స్వీమ్మింగ్ ఫూల్స్ ఉంటాయి. అలాగే వినోదం కోసం ఒక ప్రైవేట్ క్లబ్హౌస్ కూడా ఉంది. ఇక్కడ ఒకేసారిగా 24 మంది పర్యటకులు విడిది చేయొచ్చట.