సింగర్ సునీత తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది. తను పాట పాడితే అలాగే వినాలనిపిస్తుంది. కాగా ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని ను ఈ నెల 9న శంషాబాద్ లో పురాతన గుడి లో తన కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహమాడింది. కాగా సింగర్ సునీత కు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని ఇటీవలే తెలిపింది.
సునీత కేవలం సింగల్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాతగా చేస్తుంది. కాగా పెళ్లి తర్వాత వ్యాపార రంగంలో అడుగు పెట్టింది సునీత. ప్రస్తుతం ఎక్కువ బాధ్యతలను మోస్తున్న సునీతకు ఓ చానల్ ఇంటర్వ్యూ చేసింది. అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలిపింది. అంతేకాకుండా తను ఈ స్థాయికి రావడానికి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.
సునీతకు హీరోయిన్ గా ఆఫర్లు వచ్చాయని.. తను మొదట పాడిన పాట “ఈ వేళలో నీవు” మంచి విజయాన్ని సాధించగా.. అప్పటి నుంచి నుంచి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలిపింది. రామ్ గోపాల్ వర్మ తనకు ఆఫర్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా హీరోయిన్ గా నటించడానికి ఆఫర్ ఇచ్చారు అని తెలిపింది. కానీ నిజానికి తనకు నటన మీద ఆసక్తి లేదని.. హీరోయిన్ లు పడుతున్న టెన్షన్, యాక్టింగ్ దగ్గరుండి చూసినందుకు తనకు నటన మీద ఆసక్తి లేదని తెలిపింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేని తెలిపింది. అందుకే సినిమాల్లో నటించవద్దని కోరుకుంది. తనకు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు ఉందని అదే చాలు అని తెలిపింది.
కాగా ఇప్పుడు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా అనే ప్రశ్నకు.. ఇప్పుడు ఎలా చేస్తామంటూ సమాధానం ఇచ్చింది. నిజానికి తృప్తికరమైన జీవితాన్ని కోరుకున్న అని తెలిపింది. కాబట్టి ప్రస్తుతం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని తెలపగా.. ఆర్థికంగానూ లెక్కలు బాగా వేసుకుంటా అని తెలిపింది. ఇందులోనే తృప్తికరమైన జీవితం ఉంది కాబట్టి నాకు నటన వైపు ఆసక్తి లేదు అని తెలిపింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!