Rajyasabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఆ నలుగురు ఎవరంటే దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తండ్రి సినీ రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad), ప్రముఖ అథ్లెట్ పిటి ఉష(PT Usha), సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja), స్వచ్ఛంద సేవకుడు వీరేంద్ర హెగ్డే(Veerendra Heghde) నామినేట్ అయ్యారు. వీరందరూ దక్షిణాదికి చెందిన వాళ్ళు కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురిని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. దీనిలో భాగంగా రాజమౌళి.. తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విజయేంద్ర ప్రసాద్ సినీ రంగానికి చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విజయేంద్ర ప్రసాద్ భారత్ సంస్కృతిని ప్రతిబింబించేలా సినీ రంగానికి సేవలందిస్తున్నారని కొనియాడారు. విజయేంద్ర ప్రసాద్ కృషి వల్ల భారత సంస్కృతి విశ్వవ్యాప్తమయిందని స్పష్టం చేశారు. దీంతో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జక్కన్న తెరకెక్కించిన చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ స్టోరీ రాయటం జరిగింది.
సింహాద్రి, చత్రపతి, బాహుబలి, RRR.. ఇంకా పలు సినిమాలకు కథలు అందించారు. అంత మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ హిట్ చిత్రం “బజరంగీ భాయిజాన్” కి కూడా విజయేంద్రప్రసాద్ స్టోరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చెయ్యబోయే సినిమాకి కూడా కథ రాస్తూ ఉన్నారు. భారతదేశ సినిమా రంగం కీర్తి ప్రపంచ సినిమా రంగానికి తెలిసేలా సినిమాల స్టోరీలు అందించిన విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావటం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?