Corona Vaccine: కరోనా పై పోరులో కీలకమైన వ్యాక్సినేషన్ లో భారత్ దూసుకెళ్తోంది వేయడంలో మొదటి ప్లేస్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో అధిగమించింది.. ప్రపంచంలో అత్యంత వేగంగా 10 కోట్ల టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది..!! కరోనా వాక్సినేషన్ లో భారతదేశం ప్రపంచ రికార్డ్ సృష్టించింది..!! ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసులు సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఈ రికార్డు క్రియేట్ చేయడానికి భారతదేశానికి కేవలం 85 రోజుల సమయం మాత్రమే పట్టింది.. అమెరికా, చైనాల కంటే భారతదేశం లోని అత్యంత వేగంగా టీకాలు ఇచ్చినట్లు వెల్లడించింది..!! 10 కోట్ల లో 88 లక్షల మందికి మొదటి డోసు, 12 లక్షల మందికి రెండవ డోసు ఇచ్చినట్లు తెలిపింది..!
10 కోట్ల డోసులు ఇవ్వడానికి అమెరికాలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పడితే భారత్లో కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేసింది అని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది. అయితే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమానికి ఇబ్బందులు ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.. కరోనా మహమ్మారి మొదలయినప్పటి నుంచి భారత్లో కోటి 20 లక్షలకు పైగా కేసులు, లక్షా 67 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండవ స్థానంలో ఆ తరువాత భారత్ మూడో స్థానంలో నిలిచింది..