మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు మరో 12 చీతాలు (చిరుత)లు చేరాయి. దక్షిణాఫ్రికా నుండి భారత వైమానిక దళానికి చెందిన సీ – 17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానంలో 12 చీతాలు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ విమానాశ్రయాకి చేరుకోగా, అక్కడ నుండి 12 చిరుతలను హెలికాఫ్టర్ లో కునో నేషనల్ పార్క్ కు తరలించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వీటికి స్వాగతం పలికి కునో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. ఇందులో ఏడు మగ, ఆరు ఆడ చీతాలు ఉన్నాయి. వీటి కోసం పార్క్ లో పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్దం చేశారు.
నిబంధనల ప్రకారం నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్ లో ఉంచనున్నారు. కొద్ది రోజులు చిన్న ఎన్ క్లోజర్ లో ఉంచి .. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే విధంగా చేసిన అనంతరం వాటిని ఓపెన్ ఫారెస్ట్ లో వదిలేస్తారు. ఇంతకు ముందు 2020 సెప్టెంబ్ నెలలో ఎనిమిది చిరుతలను నమీబీయా నుండి తీసుకువచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్ లో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నమీబియా నుండి వచ్చిన ఎనిమిది చిరుతలను విడుదల చేశారు. తాజాగా వచ్చిన 12 చిరుతలతో కూనో పార్క్ లో చిరుతల సంఖ్య 20కి పెరిగింది.
1948 తర్వాత దేశంలో చిరుతల (చీతా) ఆనవాళ్లు కనుమరుగు అయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునః ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నమీబియా నుండి తొలుత 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ కు తరలించారు. వీటి సంఖ్యను పెంచుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ధక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో భాగంగా 12 చిరుతలు నేడు దేశానికి చేరుకున్నాయి. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
చంద్రబాబుపై పలువురు మంత్రులు ఫైర్ ..ఎవరు ఏమన్నారంటే..?
मुख्यमंत्री श्री @ChouhanShivraj ने आज दक्षिण अफ्रीका से लाए गए 12 चीतों को कूनो नेशनल पार्क में विमुक्त किया।
इन चीतों की पुनर्स्थापना से अब मध्यप्रदेश की धरती पर चीतों का कुनबा बढ़कर 20 हो गया है।#MPWelcomesCheetah #CheetahStateMP#JansamparkMP pic.twitter.com/XMBieKC9n1
— Chief Minister, MP (@CMMadhyaPradesh) February 18, 2023