Suicide: ఇటీవల కాలంలో బలన్మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ విఫలం అయ్యిందనో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనో..చదవ లేక పోతున్నామనో..ఆర్ధిక ఇబ్బందులనో..ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తొంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ బాలుడి బలవన్మరణం ఘటన చూపరులను విస్మయానికి గురి చేస్తొంది.
Read More: సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?
విషయంలోకి వెళితే..మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని భయందర్ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్ధి శత్రుఘ్న పాఠక్ (13) హెయిర్ కటింగ్ నచ్చలేదన్న కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి సెలూన్ కు వెళ్లిన పాఠక్ హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుని తనకు కటింగ్ సరిగా చేయలేదని కలత చెందాడు. చాలా చిన్నగా చేశాడని మనస్థాపానికి గురైయ్యాడు. అతని మనస్థాపాన్ని గమనించిన అతని తల్లి ఇద్దరు అక్కలు నచ్చజెప్పారు.
అయినా కాని ఆ బాలుడి మనసు కుదట పడకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ నిద్ర పోతున్న సమయంలో అపార్ట్ మెంట్ 16వ అంతస్తు నుండి ఆ బాలుడు కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: మోడీ నోట.. జగన్ మాట
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?