దేశ రాజధాని ఢిల్లీలో ఇవేళ ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు బొల్తా కొట్టింది. అజ్మీర్ నుండి గుర్ గ్రామ్ సమీపంలోని రాజ్ కోటికి వస్తున్న ప్రైవేటు బస్సు ఢిల్లీ ఎయిర్ పోర్టు సమీపంలో ఒక్కసారిగా బొల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. అదృష వశాత్తు ఒక మహిళ, బాలుడు మినహా మిగిలిన వారు అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళ, బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన బస్సును తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకుండా అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
BJP: బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత .. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్టు