Lightning Strikes: పశ్చిమ బెంగాల్ సోమవారం సాయంత్రం అసాధారణ స్థాయిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పిడుగులు పడటంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 26 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారు. దక్షిణ బెంగాల్ లోని కోల్కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం పడింది. పిడుగుల కారణంగా హుగ్లీలో 11 మంది, ముర్షిదాబాద్ లో 9 మంది, పశ్చిమ మిడ్నాపూర్ లో ఇద్దరు, తూర్పు మిడ్నాపూర్ లో ఇద్దరు, బంకురాలో ఇద్దరు మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read More: MP RRR Case: ఎంపీ రఘురామ ఐ ఫోన్పై ఏపీ సీఐడీ స్పందన ఇదీ..!!
బెంగాల్ లో పిడుగు పాటు మరణాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు వంతున, క్షతగాత్రులకు రూ.50వేలు వంతున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.