State: దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయని.. దీర్ఘకాలిక డిమాండ్ కు రాజకీయ అవసరాలు తోడు కావడంతో ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడనుందని కీలక సమీకరణాల ఆధారంగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజపీ తన ముద్రను కాపాడుకోవడంలో భాగంగా వేస్తున్న ఎత్తుగడలలో రెండు లేదా మూడు రాష్ట్రాల ఏర్పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఉత్తరప్రదేశ్ రాజకీయం గురించి.
Read More: Modi: రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
యూపీలో ఏం జరుగుతోందంటే…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల మధ్య వివాదాలు నెలకొన్నాయని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతేకాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం పీఠం నుంచి యోగిని తొలగిస్తారని, క్యాబినెట్ విస్తరణ కూడా చేయనున్నారని సైతం ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుదీర్ఘంగా చర్చించడం ఇందుకునన్న టాక్ సైతం ఉంది. అయితే, అసలు విషయం వేరేనట.
Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్… కరోనా సెకండ్ వేవ్ కష్టాలు తేలేదట
అమిత్ షా స్పెషల్ ఫోకస్
కేంద్ర హోం మంత్రి అమిత్షా యూపీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు లేదా మూడు రాష్ట్రాలుగా విభజించడం లేదా ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పూర్వంచల్, బుందేల్ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్లను నెరవేర్చడం అటు గత కొద్దికాలంగా యూపీలో తగ్గుతున్న పట్టును తిరిగి పొందడం లక్ష్యంగా బీజేపీ గేమ్ ఉందంటున్నారు. త్వరలో ఈ మేరకు క్లారిటీ రానుందని సమాచారం.