జమ్ముకశ్మీర్ లోని రాజౌరి లో ఆర్మీ క్యాంప్ పై ఈ రోజు ఊదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపు లోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కిలో మీటర్ల దూరంలోనిి దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడిజిపీ) ముఖేష్ సింగ్ తెలిపారు.
రాజౌలీ లోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మరణించినట్లు ఏడిజీపీ ముఖేష్ సింగ్ వెల్లడించారు.ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అదనపు బలగాలను మోహరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆత్మహుతి దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.