Election Commission: దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఓటింగ్ శాతం పెంచుకుంటున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పించింది. పశ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఈ మూడు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక, ఏపిలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తంపును ఈసీ తొలగించింది. 2014,2019 ఎన్నికల్లో ఏపిలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఉప సంహరించింది.
అయితే, 2012 లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలుత ఢిల్లీ అసెంబ్లీలో పోటీ చేసి విజయం సాధించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ ఓట్ల శాతం నమోదు చేసుకోవడంతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ లో అయిదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే .. కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం నాలుగు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (లేదా) లోక్ సభ లో రెండు శాతం సీట్లు పొంది రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. ఒక సారి ఒక పార్టీ జాతీయ పార్టీ హోదాను కోల్పోతే, ఆ పార్టీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులకు ఉమ్మడి గుర్తు ను పొందలేవు.
ఆ ఇద్దరి నేతల చూపు ఎటువైపు ..? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్