AIIMS Chief DR Randeep Guleria: దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ప్రస్తుతం నిత్యం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రజలను తీవ్ర భయాందోళనలు కల్గిస్తోంది. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే స్కానింగ్ సెంటర్ కు వెళ్లి సీటీ స్కాన్ తీయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో సీటీ స్కాన్ లు తీయించుకునే వారి సంఖ్య బారీగా పెరిగింది. స్వల్ప లక్షణాలు ఉన్న వారితో పాటు ఎటువంటి లక్షణాలు లేని వారు కూడా సీటీ స్కాన్ లు తీయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి. యాంటిజెన్, ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ లలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారు కూడా సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూడిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా దీనిపై సూచనలు చేశారు. సీటీ స్కాన్ ల వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు సీీటీ స్కాన్ ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
ఒక సీటీ స్కాన్ 300 నుండి 400 చెస్ట్ ఎక్స్ రేలతో సమానమని అన్నారు. తరచూ సీటీ స్కాన్ చేయడం వల్ల యువత క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయన్నారు. శరీరం రేడియేషన్ కు గురి కావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్న వారు సీటీ స్కాన్ అసలు చేయించుకోవద్దని ఆయన సూచించారు.
కేవలం ఆసుపత్రుల్లో చికిత్స చికిత్స పొందుతున్న వారు మాత్రమే అది కూడా వైద్యుల సూచనల మేరకే సీటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అయితే ముందుగా చెస్ట్ ఎక్స్ రే కు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటికీ వైద్యులు సూచిస్తేనే సీీటీ స్కాన్ చేయించుకోవాలని లేకుంటే అవసరం లేదని పేర్కొన్నారు.
CT-SCan and biomarkers are being misused. There is no advantage in doing CT-Scan if you have mild symptoms. One CT-Scan is equivalent to 300 chest x-rays, it's very harmful: AIIMS Director Dr. Randeep Guleria pic.twitter.com/fBX19cwRcD
— ANI (@ANI) May 3, 2021