Anand Mahindra: అణ్యాయుధాల కంటే కోవిడ్ భారీ నష్టం కల్గించిందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చైనా వూహాన్ నగరంలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్ లో పురుడు పోసుకుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మొదటి కేసులు కూడా ఆ ల్యాబ్ కు సమీపంలోని సీపుడ్ మార్కెట్ లో వెలుగు చూశాయి. కరోనా వైరస్ కు సంబంధించి మరో సారి వూహన్ ల్యాబ్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరో పరిశోదన తాజాగా వెలుగు చూసింది. సార్స్ – కోవ్ 2 వైరస్ ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వే శాస్త్రవేత్త బిర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్ ఒక కథనం వచ్చింది. ఈ కథనంపై ట్విట్టర్ వేదికగా మహీంద్రా స్పందించారు.
కరోనా..చైనా శాస్త్రవేత్తల సృష్టే అన్న పేరుతో మీడియా కథనాన్ని మహీంద్రా ట్వీట్ చేస్తూ… నిజాన్ని మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాంటి జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ వైరస్ ఇప్పటికే యావత్ ప్రపంచానికి అణ్యాయుధం కంటే ఎక్కవ నష్టాన్ని మిగిల్చిందని అన్నారు.
Read More: Etela Rajender: బీజేపీలో చేరుడు ఖాయమే.. డౌట్లు క్లారిఫై చేసుకున్న ఈటల..!!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 35.65 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యదిక మరణాలు చేటుచేసుకున్నాయి. మూడు లక్షలకుపైగా మరణాలతో ఇండియా రెండవ స్థానంలో ఉంది. గత కొద్ది నెలలుగా దేశంల కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగింది. అయితే ఇప్పుడిప్పుడే భారత్ లో కేసుల సంఖ్య తగ్గుతోంది.
We may never get to know the truth. But the reality is that just like the Nuclear Non-Proliferation Treaty, the world now probably needs a Biological Weapons & Hazardous Research Non-Proliferation Treaty. This virus has already caused more global damage than a nuclear weapon. https://t.co/Uid1U2ffwf
— anand mahindra (@anandmahindra) May 31, 2021