China: ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటించిన చైనా ఇప్పుడు ఇంకో రోగాన్ని వదిలిందని ప్రచారం జరుగుతోంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే యావత్ ప్రపంచం బయటపడుతుండగా మరో వైరస్ చైనా నుంచి వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. తాజాగా చైనాలో మంకీ బీ వైరస్ కనుగొనబడిందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో మంకీ బీ వైరస్ సోకి బీజింగ్కు చెందిన ఓ పశువుల వైద్యుడు కన్నుమూశాడు. దీంతో మళ్లీ ప్రపంచం వణికిపోతోంది.
Read More: China: చైనాలో ముస్లింలపై దారుణాలు… కమ్యూనిస్టులు ఏం చెప్తారో
ఎలా చనిపోయాడంటే..
చైనాలో నాన్-హ్యూమన్ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశు వైద్యుడు మంకీ బీ వైరస్ బారిన పడ్డారు. మంకీ బీ వైరస్ సోకిన రెండు మకాక్యూ జాతి కోతుల మృతదేహాలను ముట్టుకోవడంతో ఆయనకు ఈ వ్యాధి సోకిందని తెలిసింది. వికారంతో కూడిన వాంతులు పెరుగడంతో బాధితుడు పలు దవాఖానల్లో చికిత్స తీసుకున్నాడని, పరిస్థితి విషమించడంతో మే 27న మరణించాడు. ఈ వైరస్తో సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది.
Read more: Corona: కరోనా థర్డ్ వేవ్ లో డేంజర్ డేస్ ఎప్పుడో తెలుసా?
ఏంటీ వైరస్ లెక్క?
మకాక్యూ జాతి కోతుల ద్వారా ‘మంకీ బీ’ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించకపోతే మరణించే ప్రమాదం 70-80 శాతం వరకు ఉంటుంది. మంకీ బీ వ్యాధి చికిత్సకు సరైన ఔషధాలు లేవని వైద్యులు ప్రకటించడం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలాఉండగా, అమెరికాలో మంకీ పాక్స్ వైరస్ కలకలం రేపుతోంది.