దేశ ప్రధాని మోడీ ని మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆదరించిన రాష్ట్రం గుజరాత్. దీంతో మోడీ ప్రధాని అయ్యాక ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను భారీస్థాయిలో కేటాయిస్తూ ఉంటారని చాలామంది చెబుతారు. ఇదిలా ఉండగా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాన పార్టీలు అన్నీ సరికొత్త వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి.
ఇదిలా ఉంటే మోడీ సర్కార్ విధి విధానాలను ఎప్పటినుండో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ ని దెబ్బ కొట్టాలంటే సొంత రాష్ట్రంలో గుజరాత్లో అయితే కరక్ట్ అని, దేశవ్యాప్తంగా హైలెట్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎప్పటి నుండో సరైన టైం వెయిట్ చేస్తూనే ఉన్నారు. క్రిందటి సారి ప్రయత్నం చేసి విఫలం కావడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో కుల రిజర్వేషన్లు ఉద్యమాలను లేవనెత్తిన పార్టీలను కలుపుకొని పోయిన కాంగ్రెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన ఎత్తుగడలు విఫలమైనట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడతారు.
అయితే ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలావరకు కనుమరుగైన విధంగా ఉండటంతో మోడీ ని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో ఫిబ్రవరి లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 3సి అనే వ్యూహంతో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరప్షన్, క్రిమినల్టీ, క్యారెక్టర్ అనే స్ట్రాటజీ తో మోడీని దెబ్బకొట్టే ఆలోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.