Assembly election results: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్ డీ ఎఫ్ ముందంజలో ఉండగా, అసోంలో ఎన్ డీఏ, . కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో ఏఐఏడిఎంకే ముందంజలో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు విస్తృత ప్రచారం చేసి ఎలాగైనా దీదీ నుండి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ వంద సీట్లు కూడా దాటని పరిస్థితి ఉంది. అక్కడ టీఎంసీ 184 స్థానాల్లో లీడ్ లో ఉంది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. 125 స్థానాల్లో డీఎంకే లీడ్ లో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్ 78 స్థానాల్లో అధిక్యత కొనసాగిస్తుండగా యుడిఎఫ్ 60 స్థానాల్లో లీడ్ లో ఉంది. అసోంలో ఎన్ డీఏ 59 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, యుపిఎ 26 స్థానాల్లో అధిక్యతలో కొనసాగుతోంది. ఇక పుదుచ్ఛేరిలో ఏఐఏ డిఎంకే 13 స్థానాల్లో లీడ్ లో ఉండగా, డీఎంకే 8 స్థానాలలో అధిక్యతలో ఉంది. అయితే పశ్చిమ బెంగాలలో దీదీ నేతృత్వంలోని టీఎంసీ ముందంజలో ఉన్నప్పటికీ ఆమె ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. దీదీ ప్రత్యర్థి పదివేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.