ATM: నిజంగా అదిరిపోయే వార్త ఇది. ఏటీఎం లలో నగదు కొరతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్రంగా స్పందించింది. జనాల తిప్పలకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది. డబ్బు కోసం ఏటీఎంలకు వెళ్లి, అక్కడ నో క్యాష్ బోర్డ్ చూసి వెనుదిరిగే సందర్భాలు అనేకం. ఇలా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే… బ్యాంకులకు ఫైన్లు విధించే నిర్ణయం తీసుకుంది.
Read More : ATM Rules 2021: పెరగనున్న ఏటీఎం చార్జీలు..!!
ఇది రూల్స్…
ఏటీఎం మిషన్లలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పింది. ‘నెలలో 10 గంటలకు పైగా ఏ ఏటీఎంలో నగదు లేకపోయినా రూ.10,000 జరిమానా విధిస్తాం. ఇలా ఎన్ని ఏటీఎంలు ఖాళీగా ఉంటే రూ.10,000 చొప్పున అన్ని జరిమానాలు తప్పవు’ అని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్కీం అమల్లోకి వస్తుందని చెప్పింది. కాగా, ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి.
Read More : కార్డ్ లేకుండా ATM లో డబ్బులు డ్రా చేయండి .. ఇలా
ఏటీఎంలు రెడీగా ఉండాల్సిందే..
కొత్త ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు నిల్వలను పర్యవేక్షించుకోవాలని సూచించింది. కాగా, వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో బ్యాంకులకు పెనాల్టీ ఉండనుంది. అయితే బ్యాంకులు సదరు ఏటీఎం ఆపరేటర్ నుంచి ఈ సొమ్మును వసూలు చేసుకునే అవకాశాలున్నాయి.