Ayodhya rhttp://ఏఏam temple: ఆయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలులో అవినీతికి పాల్పడిందని విపక్ష నేతలు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత పవన్ పాండేలు భూమి కొనుగోలులో తీర్థ ట్రస్ట్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు ఆదివారం వేరువేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమి కొనుగోలులో జరిగిన అక్రమాలను వెల్లడించారు.
రూ.2కోట్ల విలువ చేసే భూమిని తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. కుసుమ్, హరీశ్ పాఠక్ అనే వ్యక్తుల నుండి రవి మోహన్, సుల్తాన్ అన్సారీ రూ2 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని అయిదు నిమిషాలకే వారి నుండి ట్రస్ట్ భూమిని కొనుగోలు చేసిందని చెప్పారు. ఇందు కోసం రూ.16.5 కోట్లు అదనంగా చెల్లించారని ఆరోపించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రెండు లావాదేవీలకు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని తెలిపారు. ఇలాంటి ఆరోపణలనే ఎస్పీ నేత పవర్ పాండే చేశారు. కేవలం పది నిమిషాల వ్యవధిలో పది రెట్లు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.
అయితే ఎస్పీ, ఆప్ చేసిన ఆరోపమలపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇలాంటి ఆరోపణలను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.